“1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో 3D ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆదిపురుష్ “మూవీలో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్నారు. “ఆదిపురుష్ “మూవీలో సీత పాత్రలో నటిస్తున్న కృతి తెలుగు భాషను నేర్చుకొనడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ పరాపజయాలు తనకు సమానమే అంటున్న కృతి సనన్ లాక్డౌన్ విరామాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ తన తొలి సహనటుడు మహేష్బాబు గురించి మాట్లాడుతూ .. చక్కటి వ్యక్తిత్వం కలిగి అందరితో స్నేహపూర్వకంగా ఉంటారనీ , మహేష్బాబుతో మళ్ళీ నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాననీ చెప్పారు.తాను కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాననీ , కరోనా మహమ్మారిని ఎదురించడానికి వ్యాక్సిన్ వేసుకోవడం ఒక్కటే మార్గమని తాను నమ్ముతున్నాననీ , ‘ఆదిపురుష్’ గురించి మాట్లాడుతూ తన కెరీర్లో భిన్నమైన సినిమాగా నిలుస్తుందనే నమ్మకముందనీ , సెట్స్లో గడిపిన ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాననీ , తొందరగా షూటింగ్ పునఃప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: