ప్రముఖ నటుడు శక్తి కపూర్ తనయ శ్రద్ధా కపూర్ “తీన్ పత్తి “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. “ఆషికి 2 “, “ఏక్ విలన్ “, “బాఘీ “, స్త్రీ “, “ఓకే జాను “, “బాఘీ 3”, “చిచ్చోరే “వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రద్ధా కపూర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో “మూవీ తో శ్రద్ధా కపూర్ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. నటి గానే కాకుండా సింగర్ గా శ్రద్ధా కపూర్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రద్ధాకపూర్ తన పేరెంట్స్ తో మాల్దీవులు చేరుకుని అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మాల్దీవుల బీచ్ లో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధాకపూర్ “ఫోటో బై మమ్మీ “అంటూ తన ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























