టెక్నాలజీ పుణ్యమా అని చేతిలో ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతిలో వున్నట్టు అయిపోయింది ఇప్పుడు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో అవగాహన కూడానే బాగానే పెరుగుతుంది. దానితో సినిమా పరిస్థితి కూడా అలానే అయిపోయింది. ఒకప్పుడు థియేటర్ లో సినిమా చూడాలంటే అదొక థ్రిల్లింగ్ లా ఫీలయ్యేవారు అందరూ. కానీ ఇప్పుడు థియేటర్ లో చూడకపోయినా పర్వాలేదు ఎలాగూ ఆన్ లైన్ లో వస్తాయి కదా అన్న ధోరణి పెరిగిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు వచ్చిన తర్వాత సినిమాల ఆ ప్రభావం మరింత పడింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాతే జనాల్లో సినిమాలపై కాస్త ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పొచ్చు. థియేటర్లో సినిమాలు రిలీజ్ అయినా కూడా మరికొద్ది రోజుల్లో అవి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో దర్శనమిస్తున్నాయి. దానికి తోడు కరోనా వల్ల ఓటీటీ కి గిరాకీ బాగా పెరిగింది. వెబ్ సిరీస్లకైతే లెక్కేలేదు. సినిమాకి `మించి`న వినోదం… ఓటీటీల్లో కనిపిస్తోంది. సినిమాలకంటే సెన్సార్ లు ఉంటున్నాయి.. కానీ ఓటీటీ కి ఆ నిబంధనలు లేవు.
అయితే ఇప్పుడు కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓటీటీ ఛానళ్లకు కూడా సెన్సారు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి షరతులతో కూడిన కొన్ని నిబంధనల జాబితా కూడా తయారుచేసింది. ఓటీటీ లో ఐదు అంశాలను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా ఓటీటీ విభజన చేసినట్టు తెలుస్తుంది. అన్ని వయసుల వారు చూసేలా కంటెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మరి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఓటీటీ వేదికలు ఎలా స్పందిస్తాయో చూాడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: