అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవల అడవి శేష్ పుట్టిన రోజు సందర్భంగా మేజర్ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేసిన మూవీ మేకర్స్.. తాజాగా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మహేష్ బాబు, అడవి శేష్ ట్విట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2nd July 2021. The #MAJOR day 😊@adivisesh @sonypicsindia @GMBents @AplusSMovies @SashiTikka #MajorOnJuly2 pic.twitter.com/iHSDCo80uy
— Mahesh Babu (@urstrulyMahesh) January 29, 2021
కాగా ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల `దబాంగ్ 3`బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ కు ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: