సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్తో పాటు ఓ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. థమ్స్ అప్ యాడ్ కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్త్నున్నారు. తెలుగులో మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా, హిందీలో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా వీరిద్దరూ కలిసి మరో యాడ్ లో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా షూట్ లో పాల్గొన్న ఫొటోలు షేర్ చేసిన రణవీర్.. నాకు పరిచయం అయిన వారిలో ఫైనెస్ట్ జెంటిల్మెన్ అయిన మహేష్ని కలవడం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. నా బిగ్ బ్రదర్ మహేష్పై నా ప్రేమ, గౌరవం ఎప్పుడు ఉంటాయి అని పేర్కొన్నారు. ఇక మహేష్ కూడా మీతో పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగించింది అనిపేర్కొన్నారు.
View this post on Instagram

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























