సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాని హీరోగా సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి ఒక కథానాయిక కాగా మరో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు. కోల్ కత్తా లో షూటింగ్ కు ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా హైదరాబాద్ లో కోల్ కత్తా నేపథ్యంలో సెట్స్ రూపొందించి చిత్రీకరణ జరపాలని నిర్ణయించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత నాని “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. “కృష్ణార్జున యుద్ధం ” మూవీ లో జంటగా నటించి ప్రేక్షకులను అలరించిన నాని , అనుపమ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ లో జంటగా నటించి మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: