సొంత ఊరి గురించి సంపత్ నంది – ప్రకృతికి ఏది సరితూగదు

Director Sampath Nandi Becomes Nostalgic During The Movie Shoot At His Home Town

అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతూ.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమా ‘ఓదెల రైల్వేస్టేష‌న్’. క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు కూడా చిత్రయూనిట్. ప్రస్తుతం తెలంగాణలోని ఓదెల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇక ఇదిలా ఉండగా సంపత్‌ నంది సొంత వూరు ఓదెల అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ద్వారా తన ఊరి ప్రకృతి గురించి అక్కడి నీటిని గురించి చెపుతున్నాడు. ప్యూరెస్ట్, కూలెస్ట్, హెల్దీయస్ట్ ఈ మినరల్ వాటర్ కూడా నేచర్ నుండి వచ్చే వాటర్ సరితూగవు అని ట్వీట్ చేసాడు. కాగా ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్స్ అందించిన శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ ప్రొడ‌క్ష‌న్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది.

ప్రస్తుతం సంపత్ నంది హీరో గోపీచంద్ తో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్ర‌స్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సంవ‌త్స‌రంలో మొద‌ల‌యిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + fourteen =