అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతూ.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమా ‘ఓదెల రైల్వేస్టేషన్’. కన్నడలో 25 చిత్రాలకు పైగా నటించిన వశిష్ట సింహ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెభా పటేల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు కూడా చిత్రయూనిట్. ప్రస్తుతం తెలంగాణలోని ఓదెల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Purest..
coolest..
healthiest..
No mineral water can match this natural mineral treasury of mother nature.Feeling very nostalgic at my native place #Odela#OdelaRailwayStation #shootdiaries #nostalgia #mothernature #goodvibes pic.twitter.com/y5y5aakI2I
— Sampath Nandi (@IamSampathNandi) October 12, 2020
ఇక ఇదిలా ఉండగా సంపత్ నంది సొంత వూరు ఓదెల అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ద్వారా తన ఊరి ప్రకృతి గురించి అక్కడి నీటిని గురించి చెపుతున్నాడు. ప్యూరెస్ట్, కూలెస్ట్, హెల్దీయస్ట్ ఈ మినరల్ వాటర్ కూడా నేచర్ నుండి వచ్చే వాటర్ సరితూగవు అని ట్వీట్ చేసాడు. కాగా ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది.
ప్రస్తుతం సంపత్ నంది హీరో గోపీచంద్ తో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సంవత్సరంలో మొదలయిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: