బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను” , “మహర్షి ” , “సరిలేరు నీకెవ్వరు” వంటి మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు తన తరువాత మూవీ దర్శకుడు పరశురామ్ తో చేయనున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒక మూవీ ని అనౌన్స్ చేశారు. ఈ మూవీ స్పై థ్రిల్లర్ గా రూపొందనుందని, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ మూవీ కై చాలాకాలంగా ప్రేక్షక, అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. హీరో మహేష్ బాబు తో ఎప్పుడు సినిమా రూపొందించినా జేమ్స్ బాండ్ తరహా స్పై థ్రిల్లర్ గా ఉంటుందని రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ మూవీ లో తమ అభిమాన హీరో స్పై పాత్రలో నటిస్తారనే వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. రాజమౌళి ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం” మూవీ రూపొందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: