`పవర్`, `సర్దార్ గబ్బర్ సింగ్`, `జై లవ కుశ`, `వెంకి మామ`… ఇలా వరుసగా అగ్ర కథానాయకులతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు యువ దర్శకుడు కె.యస్. రవీంద్ర (బాబీ). రీసెంట్ గా రిలీజైన `వెంకిమామ`తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాబీ… త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే దిశగా అడుగులు వేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే… రీసెంట్ గా అల్లు అర్జున్ తో బాబీ తదుపరి చిత్రం ఉంటుందని, గీతా ఆర్ట్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుందని వార్తలు వినిపించాయి కూడా. తాజా కథనాల ప్రకారం… హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో బాబీ నెక్ట్స్ ఫిల్మ్ కన్ఫర్మ్ అయిందని తెలిసింది. అలాగే, ఓ స్టార్ హీరో ఇందులో నటిస్తాడని టాక్. త్వరలోనే బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: