సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కనువిందు చేసిన కథానాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. `శ్రీమంతుడు` చిత్రంలో జంటగా నటించిన ఈ ఇద్దరూ… ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. కట్ చేస్తే… ఐదేళ్ళ విరామం అనంతరం ఈ ఇద్దరూ మరోసారి జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `మహర్షి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాయికగా శ్రుతిని ఎంపికచేశారని సమాచారం. ప్రస్తుతం శ్రుతి… మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కాప్ స్టోరీ `క్రాక్`లో హీరోయిన్ గా నటిస్తోంది. రెండేళ్ళ గ్యాప్ తరువాత ఈ చిత్రంతోనే టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తోంది శ్రుతి. ఈ లోపే మహేష్ సినిమాలో అవకాశం రావడం వార్తల్లో నిలుస్తోంది. అయితే, మహేష్, వంశీ చిత్రంలో శ్రుతి ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: