సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాని అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మానందం, సంగీత ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తయ్యిందని, ఫైనల్ షెడ్యూల్ కోసం ఛార్జ్ అవుతున్నామని దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
కాగా… చివరి షెడ్యూల్ కోసం యూనిట్ నవంబర్ 1 నుంచి కేరళకు పయనమవనున్నట్టు… అక్కడ నిరవధికంగా సాగే ఈ లాంగ్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు సమాచారం.
దేవిశ్రీ ప్రసాద్ స్వరసారథ్యంలో రూపొందుతున్న `సరిలేరు నీకెవ్వరు`… 2020 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























