యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో… అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా దర్శనమివ్వనున్నట్టు సమాచారం. అందమైన ప్రేమకథతో పాటు కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో మరో నాయికగా మిస్ తెలంగాణా 2018, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ సాయి కామాక్షి భాస్కర్ల ఎంపికైనట్టు సమాచారం. త్వరలో కామాక్షి ఎంట్రీపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తుండగా… ‘బన్నీ’ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2020 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: