‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ఫుల్ లేడీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు నందినీ రెడ్డి. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం మరో డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేస్తున్నారని సమాచారం. అంతేకాదు… ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించనుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ప్రస్తుతం నందినీ రెడ్డి ఈ కథను డెవలప్ చేసే పనిలో ఉన్నారని తెలిసింది. అలాగే… ఈ చిత్రాన్ని నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం నందినీ రెడ్డి కొంతమంది దర్శకులతో కలసి నెట్ఫ్లిక్స్ కోసం ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది నవంబర్ కల్లా పూర్తి కానుందట. అది పూర్తైన వెంటనే… వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనున్న ఈ కొత్త చిత్రంపై దృష్టి పెట్టనున్నారట ఈ లేడీ డైరెక్టర్. త్వరలోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























