రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ‘సాహో’ టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇప్పటివరకు ‘సయ్యా సైకో’ ‘ఏ చోట నువ్వున్న’ ‘బ్యాడ్ బాయ్’ అనే మూడు పాటలను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈ రోజు నాలుగో పాటను రిలీజ్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ను ఇచ్చారు. ‘బేబీ ఓన్ట్ యు టెల్ మీ..’ అంటూ సాగే పాటను ఈ రోజు రిలీజ్ చేసారు. మంచి మెలోడీ తో ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, లాల్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మురళీ శర్మ, ముఖేష్ మంజ్రేకర్, మందిరా బేడీ ఇలా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన `సాహో` ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ అండర్ కవర్ పోలీసాఫీసర్గా కనిపించబోతున్నాడు.
మరి ప్రస్తుతం ఎక్కడ చూసినా సాహో పేరే వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. భారీ స్థాయిలో ఏర్పడిన అంచనాలను ఈ సినిమా ఎంత వరకు రీచ్ అవుతుందో చూద్దాం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























