మొత్తానికి చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. గతంలో చేసిన తప్పులు చేయకుండా సినిమాల ఎంపిక విషయం లో జాగ్రతలు తీసుకుంటున్నాడు. తొందరపడకుండా తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతకొద్ది నెలలుగా షూటింగ్ జరుపుకుంతుండగా.. మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తేజ్ తాజాగా ఓ కొత్త డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఉయ్యాల జంపాల -మజ్ను సినిమాల దర్శకుడు విరించి వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సుబ్బు కు తేజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సుబ్బ చెప్పిన కథ తనకు బాగా నచ్చడంతో.. కథలో మంచి స్కోప్ ఉండడంతో తనకు తాను కొత్తగా ప్రజెంట్ చేసుకునేందుకు సినిమా ఉపయోగపడుతుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. దీనితో పాటు మరో రెండు కథలను కూడా తేజ్ లైన్ లో పెట్టినట్టు సమాచారం. చూద్దాం మరి ఈ సినిమాలు తేజ్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తాయో..!
[youtube_video videoid=QvSP5gJkKg0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: