హిందీనాట పలువురు తెలుగు దర్శకులు తమదైన ముద్రవేశారు. అయితే, వరుస నెలల్లో టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం అరుదైన విషయమనే చెప్పాలి. ఈ ఏడాది అలాంటి అరుదైన సంఘటనే హిందీనాట చోటుచేసుకుంటోంది. జూన్, జులై, ఆగస్టు… ఇలా ఈ మూడు నెలల్లో మన దర్శకులు వరుసపెట్టి అక్కడ రంగప్రవేశం చేస్తున్నారు. ఆ దర్శకులు మరెవరో కాదు… సందీప్ రెడ్డి వంగా, ప్రకాష్ కోవెలమూడి, సుజీత్. ఇప్పటికే జూన్ 21న విడుదలైన `అర్జున్ రెడ్డి` రీమేక్ `కబీర్ సింగ్`(షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరోహీరోయిన్లు) తో సందీప్ బాలీవుడ్లో స్ట్రాంగ్ ఇంప్రెషన్ వేస్తే… జులై 26న `జడ్జ్మెంటల్ హై క్యా?` (రాజ్కుమార్ రావ్, కంగనా రనౌత్)తో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు దర్శకేంద్రుడి తనయుడు ప్రకాష్ కోవెలమూడి. ఇక ఆగస్టు 15న బహుభాషా చిత్రం `సాహో`(ప్రభాస్, శ్రద్ధా కపూర్)తో సుజీత్తో హిందీనాట తొలి అడుగులు వేస్తున్నాడు. `సాహో` పేరుకి బహుభాషా చిత్రమైనా… ఇందులో బాలీవుడ్ నటులకే పెద్దపీట వేయడం గమనార్హం. మరి…`కబీర్ సింగ్`తో సందీప్ తెలుగువాడి సత్తాని మరోసారి చాటి ఘనవిజయం అందుకున్న నేపథ్యంలో… ప్రకాష్, సుజీత్ కూడా అదే బాటలో వెళ్ళి బ్లాక్బస్టర్స్ అందుకుంటారేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=4ntpdSTgfJw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























