2014లో విడుదలైన `రన్ రాజా రన్`తో దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టాడు సుజీత్. శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా రూపొందిన సదరు స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్… సుజీత్కి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. `రన్ రాజా రన్` విడుదలైన ఐదేళ్ళ తరువాత ఇప్పుడు తన రెండో సినిమాతో పలకరించబోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆ చిత్రమే `సాహో`. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్… ఆగస్టు 15న విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… సుజీత్ తొలి చిత్రం `రన్ రాజా రన్` కూడా ఆగస్టు నెలలోనే (2014 ఆగస్టు 1) రిలీజైంది. అంటే… సుజీత్ ఆగస్టు నెల బాగా కలిసొచ్చిందన్నమాట. మరి… సుజీత్ సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అయి… ఈ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న `సాహో` కూడా ఘనవిజయం సాధిస్తుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రభాస్కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది.
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: