సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కలిసొచ్చిన నిర్మాతల్లో దిల్
రాజుకి, అనిల్ సుంకరకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇండస్ట్రీ హిట్ పోకిరి
తరువాత సరైన విజయం లేని మహేష్కి… దూకుడు
తోనే మళ్ళీ ఘన విజయం దక్కింది. అలాంటి దూకుడు
ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్లో అనిల్ సుంకరకి కూడా భాగస్వామ్యం ఉంది. ఇక దిల్
రాజు విషయానికి వస్తే… మహేష్ కాంబినేషన్లో ఆరేళ్ళ క్రితం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ని నిర్మించి బ్లాక్బస్టర్ అందుకున్నాడు. అంతేకాదు.. తాజాగా సి.అశ్వనీదత్, పీవీపీతో జట్టుకట్టి సంయుక్తంగా నిర్మించిన మహర్షి
కూడా టాక్తో సంబంధం లేకుండా మంచి వసూళ్ళు రాబడుతోంది. ముఖ్యంగా… నైజాం ఏరియాలో 11 రోజులకిగానూ దాదాపు రూ.25 కోట్ల షేర్ రాబట్టి టాప్ 4గా నిలచింది మహర్షి
. అలాగే.. పలు చోట్ల రికార్డు స్థాయి వసూళ్ళను ఆర్జిస్తూ మహేష్ కెరీర్లో ది బెస్ట్గా దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో… అందరి చూపు మహేష్ తదుపరి చిత్రంపైనే ఉంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా… జూన్ నుంచి పట్టాలెక్కనుంది. కాగా.. ఈ సినిమాకి దిల్
రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరించనున్నారని చాన్నాళ్ళ క్రితమే వార్తలు వినిపించాయి. అయితే.. గత కొంతకాలంగా కేవలం అనిల్ సుంకర మాత్రమే ఈ చిత్రానికి నిర్మాతగా ఉంటాడని… దిల్
రాజుకి, ఈ ప్రాజెక్ట్కి ఏ సంబంధం ఉండదని కథనాలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహేష్ 26ని దిల్
రాజు, అనిల్ సుంకర కలసి నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావచ్చంటున్నారు. మరి.. కలిసొచ్చిన నిర్మాతలతో మహేష్ మరోసారి ఘనవిజయం అందుకుంటాడేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=bNxospg7aL4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: