సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. కాగా… ఈ సంక్రాంతికి `పేట`తో పలకరించిన రజినీ… ప్రస్తుతం కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. పాన్ – ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. రజినీకి జోడీగా నయనతార, కీర్తి సురేష్ నటించబోతున్నారని సమాచారం. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరాలు అందించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను ఏప్రిల్ 10 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఏప్రిల్ 10 సూపర్ స్టార్కి లక్కీ డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే… గతంలో అదే రోజున `అరుణాచలం` (97), `పడయప్పా` (నరసింహా) (99) చిత్రాలు విడుదలై బ్లాక్బస్టర్ మూవీస్గా నిలిచాయి. మరి… అదే ఏప్రిల్ 10న ప్రారంభం కానున్న రజినీ కొత్త చిత్రం కూడా సంచలనాలకి కేంద్ర బిందువుగా నిలుస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=h2K6y-aVFD8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























