హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ.. ఈ దుర్ఘటనలో తల్లిని కోల్పోయి, తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను కేసు విచారణ కొనసాగుతున్న కారణంగా కలవలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు అల్లు అర్జున్ ఎక్స్లో.. “దురదృష్టకర సంఘటన తర్వాత నిరంతరం వైద్య సంరక్షణలో ఉన్న యువ శ్రీ తేజ్ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయపరమైన విచారణల కారణంగా, ఈ సమయంలో ఆయనను మరియు అతని కుటుంబాన్ని సందర్శించవద్దని నాకు సూచించబడింది.” అని తెలిపారు.
ఇంకా ఆయన ఇలా తెలిపారు.. “నా ప్రార్థనలు వారితోనే ఉంటాయి మరియు వైద్య మరియు కుటుంబ అవసరాలను తీర్చడానికి నేను బాధ్యత వహించడానికి కట్టుబడి ఉన్నాను. నేను అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను మరియు అతనిని మరియు అతని కుటుంబాన్ని వీలైనంత త్వరగా కలవాలని నేను ఎదురుచూస్తున్నాను” అని చెప్పారు. కాగా ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా బాధిత కుటుంబానికి రూ.25లక్షలు ఆర్ధిక సాయం అందిస్తానని ఇప్పటికే అల్లు అర్జున్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే బాలుడి చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని, ఇకపై ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 13న అరెస్ట్ చేయగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో తర్వాతి రోజు విడుదలైన సంగతి తెలిసిందే.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























