గత ఏడాది విరూపాక్షతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.ఈసినిమా తరువాత తేజ్ పక్కా మాస్ చేయలనుకున్నాడు దాంతో డైరెక్టర్ సంపత్ నంది చెప్పిన కథకు ఓకే చెప్పాడు.అదే గాంజా శంకర్.అక్టోబర్ లోనే సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది అయితే ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు దాంతో సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి.అయితే వీటిలో నిజం లేదని తెలిసింది.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ బరువు తగ్గే పనిలో వున్నాడట అందుకే సినిమా ఆలస్యం అవుతుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సినిమాకు అన్నిరెడీ అయిపోయాయట.అన్ని కుదిరితే వచ్చే నెల నుండి షూటింగ్ మొదలుపెట్టనున్నారు.మాస్ సినిమాలు తీయడంలో సంపత్ నంది దిట్ట అయితే ఈసారి సాయి ధరమ్ ను ఊర మాస్ గా చుపించనున్నాడట.ఈసినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకోవాలనుకుంటున్నారట.త్వరలోనే ఈవిషయంలో క్లారిటి రానుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈఏడాది చివర్లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























