ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’. ఎఫ్ఐఆర్ సినిమాతో ఆకట్టుకున్న మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. మంజు వారియర్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 17న తెలుగు, తమిళ్ లో వరల్డ్వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో ఆర్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకలో మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు మూడేళ్ల తర్వాత నా సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. సైంధవ్లో ఒక గెస్ట్ రోల్ చేశాను. పూర్తిస్థాయిలో ‘మిస్టర్ ఎక్స్ తో రావడం చాలా ఆనందంగా ఉంది. మిస్టర్ ఎక్స్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. డైరెక్టర్ మను ఆనంద్ గారి ఎఫ్ఐఆర్ సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన మిస్టర్ ఎక్స్ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, క్యారెక్టర్స్ అన్నీ కలిసి గొప్ప అనుభూతి కలిగించేలా తీర్చిదిద్దారు. గౌతమ్ చాలా కొత్త క్యారెక్టర్ చేశాడు. అతను ఇప్పటివరకు చేయని పాత్ర ఇది. మంజు మేడం అద్భుతమైన యాక్షన్ చేశారు. ఆమె యాక్షన్ బిగ్ స్క్రీన్ మీద చాలా మంచి అనుభూతి ఇస్తుంది. అలాగే అతుల్య పాత్ర కూడా చాలా బాగా చేసింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుంది. తప్పకుండా సినిమాకు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























