మలయాళ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ అదే టైటిల్ తో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. పరవ ఫిలింస్ పతాకంపై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. షైజు ఖలీద్ డీవోపీ కాగా, సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు. వివేక్ హర్షన్ ఎడిటర్గా.. అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సర్వైవల్ థ్రిల్లర్ను సమ్మర్ స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని తెలుగు ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఏప్రిల్ 6న థియేటర్లలోకి వచ్చిన ఈ ‘మంజుమ్మల్ బాయ్స్’ తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ రాబట్టుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ రూ. 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
The boys have won over the Telugu audience with their adventure ❤️🔥#ManjummelBoys collects 𝟏𝟎 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 in the Telugu States and going super strong at the box office 🔥
Book your tickets now!
🎟️ https://t.co/HZM3VzzQm7Telugu release by @MythriOfficial, @Primeshowtweets &… pic.twitter.com/7G8rQRKXWZ
— Mythri Movie Makers (@MythriOfficial) April 16, 2024
కాగా తమిళనాడులో యదార్థంగా జరిగిన ఒక సంఘటన స్ఫూర్తితో దీనిని రూపొందించడం విశేషం. కొచ్చికి చెందిన కొంతమంది స్నేహితుల కథను గొప్ప సర్వైవల్ థ్రిల్లర్గా వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు’. 2006లో కొడైకెనాల్లోని గుణ కేవ్స్లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మల్ యువకుల నిజమైన అనుభవం ఆధారంగా తెరకెక్కింది. ఇక నిజ జీవితంలో జరిగిన సంఘటన కావడం, అలాగే సినిమాను చూస్తున్నంతసేపూ ఉత్కంఠభరితంగా ఉండటంతో ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: