టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంటే ఇండియాలో తెలియని వారుండరు. అయితే ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల తర్వాత ఆయన పేరు విదేశాల్లో సైతం మారుమ్రోగిపోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి అమెరికా సహా పాశ్చాత్య దేశాల్లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇక జపాన్ దేశంలో అయితే.. రాజమౌళి క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే. తాజాగా జపాన్లో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడి ప్రజలు ఆయనపై అపార అభిమానాన్ని ప్రదర్శించారు. తమవాడిగా భావించిన జపాన్ దేశస్తులు రాజమౌళికి ఘన స్వాగతం పలికారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వరల్డ్ వైడ్గా సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. జపాన్లో అయితే ఈ చిత్రం రిలీజై 500 రోజులకు పైగా అవుతున్నా.. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండటం విశేషం. కాగా ఈ చిత్రం రిలీజై మార్చి 25నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి రాజమౌళి తన సతీమణితో కలిసి ఆ దేశం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనతో ముచ్చటించడానికి, కలిసి ఫోటోలు దిగడానికి జపనీయులు ఉత్సాహం చూపించారు.
ఒక 83 ఏళ్ల వృద్ధురాలు రాజమౌళికి స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఆ దేశ సాంప్రదాయం ప్రకారం.. తమకు ఇష్టమైన వాళ్లకు ఇచ్చే ‘ఓరిగామి’ క్రేన్లను, ఆమె స్వయంగా తయారు చేసి రాజమౌళికి ఇవ్వడం విశేషం. సదరు వృద్ధురాలికి ఆర్ఆర్ఆర్ మూవీ బాగా నచ్చడంతో ఆమె రాజమౌళికి ప్రేమతో వాటిని తయారు చేసి ఇచ్చింది. ఈ మేరకు విషయాన్ని రాజమౌళి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె చూపించిన ఆదరాభిమానాలు తనకు ఎంతో సంతోషాన్నిచ్చాయని, జీవితాంతం గుర్తుంచుకోదగిన గిఫ్ట్ ఇదని ఆయన పేర్కొన్నారు.
In Japan, they make origami cranes &gift them to their loved ones for good luck& health. This 83yr old woman made 1000 of them to bless us because RRR made her happy. She just sent the gift and was waiting outside in the cold.🥹
Some gestures can never be repaid.
Just grateful🙏🏽 pic.twitter.com/UTGks2djDw— rajamouli ss (@ssrajamouli) March 18, 2024
ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఒక థియేటర్కు వెళ్లిన రాజమౌళి ప్రేక్షకుల కేరింతల మధ్య సినిమాను వీక్షించారు. ఒకవైపు స్క్రీన్పై మూవీ రన్ అవుతుండగా.. దీనిని ఆయన తన ఫోన్లో వీడియో తీశారు. ఈ సందర్భంగా థియేటర్లో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. వారి మధ్యకు వెళ్లిన రాజమౌళి చాలామందికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇదిలావుండగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే. మహేష్ నటిస్తోన్న 29వ సినిమా కానుండటంతో దీనికి తాత్కాలికంగా ఎస్ఎస్ఎంబీ29 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.
తాజా పర్యటన సందర్భంగా రాజమౌళి ఈ సినిమా గురించి జపాన్ ప్రేక్షకులకు కొన్ని క్రేజీ అప్డేట్స్ పంచుకున్నారు. దీనిని పాన్ వరల్డ్ మూవీగా రూపొందించనున్నానని, ఇందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే స్టోరీ రాయడం పూర్తయిందని, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఇంకా నటీనటుల ఎంపికను పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. సినిమా కోసం ప్రీవిజువలైజేషన్ చేస్తున్నామని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నామని తెలియజేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: