సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఫైనల్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మహేష్ నెక్స్ట్ సినిమాపై పడింది. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమా చేస్తున్నాడు. మరి రాజమౌళి-మహేష్ కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు కదా.. ఇప్పటినుండే ఈసినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మహేష్ కూడా తన పూర్తి ఫోకస్ ను ఇప్పుడు రాజమౌళి సినిమాపై పెట్టనున్నాడు. ఇదిలా ఉండగా ఈసినిమా గురించి అప్పుడప్పుడు విజయేంద్రప్రసాద్ పలు ఆసక్తికర విషయాలు విషయాలు తెలియచేస్తూనే ఉన్నారు. ఈసినిమా ఫారెస్ట్ అడ్వెంచరస్ నేపథ్యంలో తెరకెక్కుతుందని ఇప్పటికే తెలిపారు. ఇప్పుడు మరో సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించారు విజయేంద్ర ప్రసాద్.. ఫిజి ఐలాండ్ లో టూరిజం అభివృద్ది చేయడం కోసం నేను ఒక కథను రాస్తున్నా..
మేమే ప్రొడ్యూస్ చేస్తాం.. ఓ మంచి సినిమా అవుతుంది అంటూ తెలిపారు. ఇంకా రాజమౌళి-మహేష్ సినిమా గురించి మాట్లాడుతూ కథ పూర్తయిందని స్పష్టం చేశారు. అలానే అజయ్ దేవగన్ కోసం ఒక సినిమాను రాస్తున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు.
మరి ఈసినిమాను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కనీసం సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఒక మూడేళ్లయినా పడుతుందని అనుకుంటున్నారు. ఇక కాగా ఈసినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: