గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ప్రత్యేక ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి మొత్తం 8వేల మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ దంపతులకు రామ్ మందిర్ క్షేత్ర తీర్థ్ ట్రస్ట్ ఆహ్వానం పలికింది. ఈ మేరకు ట్రస్ట్ ప్రతినిధి నేడు చరణ్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#RamCharan Received the Official Invitation at his Residence for Ram Mandir 🙏🛕pran pratishtha ceremony on Jan 22nd. Jai Shri Ram 🚩@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/U73wamMfMD
— Trends RamCharan ™ (@TweetRamCharan) January 12, 2024
కాగా ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రణబీర్ కపూర్, అలియా భట్, జాకీ ష్రాఫ్, ధనుష్, రాజ్ కుమార్ హిరాణీ, రోహిత్ శెట్టి తదితర సెలబ్రిటీలు రామ్ జన్మభూమి మందిర్ ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు హాజరు కావడానికి అధికారిక ఆహ్వానం అందుకున్నారు. కాగా నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ఈ నెల 22న బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహాన్ని ప్రతిష్టించనున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో జనవరి 16 నుండి దీనికి సంబంధించిన ముఖ్య క్రతువులను ఆలయ ట్రస్ట్ ప్రారంభించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఇప్పటికే ప్రధాని మోదీ ఈ 11 రోజులపాటు అనుష్ఠానం పాటిస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్లు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: