మహేష్ సతీమణి నమ్రత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మహేష్ ను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటినుండే సినిమాలకు గుడ్ బై చెప్పి మహేష్ బాబు కు ప్రతి విషయంలో అండగా.. సపోర్ట్ ఉంటూ వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం నమ్రత బాగానే యాక్టివ్ గా ఉంటారు. మహేష్ గురించి కానీ, పిల్లలు గౌతమ్, సితార కు సంబంధించిన విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా మరో ఎమోషనల్ పోస్ట్ ను పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ నటించిన గుంటూరుకారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరు లో నిన్న జరిగిన సంగతి కూడా విదితమే. ఈ సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ నాకు అమ్మ అయినా మీరే, నాన్న అయినా మీరే.. మీరే నాకు అన్నీ అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇప్పుడు నమ్రత తన సోషల్ మీడియా ఫ్యాన్స్ గురించి స్పందిస్త.. మహేష్ అభిమానుల గురించి ఇప్పటికే ఎంతో మంది గొప్పగా చెప్పారు..బహుశా చివరిగా చెప్పే వ్యక్తిని నేనే కావచ్చు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎప్పటికప్పుడు మహేష్ పై ప్రేమను చూపిస్తునే ఉన్నారు.. ప్రతిసారి అండగా నిలిచి కష్టపడి పనిచేసేలా చేస్తున్నారు. గుంటూరు లో మహేష్ కు అలానే గుంటూర్ కారం టీమ్ కు దక్కిన ఆదరణ చూస్తుంటే ఒక్క విషయం మాత్రం గర్వంగా చెప్పగలను.. మహేష్ నువ్వు నీ ఫ్యాన్స్ కు ఒక ఎమోషన్.. ఈప్రేమను బ్రతికి ఉన్నంతకాలం ఇలానే పొందాలని కోరుకుంటున్నా.. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: