అగ్రహీరో వెంకటేష్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా సైంధవ్. ఈసినిమా వెంకీ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో చాలా కాలం తరువాత మళ్లీ వెంకీ మాస్ రోల్ తో రాబోతుండటంతో సినిమాపై మొదటినుండీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో శ్రద్ద శ్రీనాథ్, ఆండ్రియా, నమాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ కూడా పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా పనిచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా వెంకటేష్ తెలుగు సినీ పరిశ్రమ లో 75 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు. హైదరాబాద్ లో వెంకీ 75 పేరిట ఈ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఎంతోమంది ప్రముఖ సినీ నటులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కొన్ని వేడుకలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి వేడుకే ఇది. కథలో ఎంపికలో ఒక సినిమాకి మరో సినిమాకి పొంతన లేకుండా ప్రయాణం చేస్తున్నారు వెంకీ. తన ‘మల్లీశ్వరి’ నాకు ఇష్టమైన చిత్రం. కుటుంబం, యాక్షన్, ప్రేమ కథలు.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. ఈ ప్రయాణం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటున్నా. మేం కలిసి సినిమా చేయాలనేది తన కోరికా నా కోరికా కూడా. మంచి కథ కుదిరితే నా సోదరుడు వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుంది అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: