లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కు కాస్త గ్యాప్ రావడంతో చెర్రీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే తాజాగా ముంబై వెళ్లిన చరణ్ సతీమణి ఉపాసన ఇంకా మొదటిసారి కూతురు క్లింకార తో కలిసి అక్కడ శ్రీ మహాలక్ష్మీ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. ఆ తరువాత మహీరాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను సైతం ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్కడ ఫొటోలను తన ఇన్ట్సాలో పోస్ట్ చేస్తూ మహాారాష్ట్ర ప్రజల ఆతిథ్యం, ఆప్యాయతకు కృతజ్ఞతలు అంటూ తమ పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: