సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. తొలిసినిమా ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన ఆయన.. అనంతరం ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్లోకి ఘనంగా అడుగుపెట్టాడు. దీని తర్వాత తాజాగా స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ సినిమాను తెరకెక్కించి మరోసారి సాలిడ్ హిట్ అందుకున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా 17 రోజుల్లో దాదాపు 900 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ఫుల్ రన్లో రూ.1,000 కోట్ల మార్క్ టచ్ చేసే దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొదటి సినిమాతోనే తానేంటో.. తన మేకింగ్ ఎలా ఉంటుందో.. వెల్లడించిన సందీప్ తాజాగా యానిమల్ మూవీతో మరోసారి తన స్టైల్ ఆఫ్ థింకింగ్తో అందరినీ థ్రిల్కి గురిచేశాడు. సాధారణంగా తెరపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి ఇండియన్ డైరెక్టర్స్ పెద్దగా సాహసించరు. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో? అని జంకుతారు. అయితే, ఇలాంటి వాటిని సందీప్ అస్సలు కేర్ చేయడు. స్టోరీ ప్రకారం.. ఆ సీన్ ఏం డిమాండ్ చేస్తుందో? తాను ఏ విధంగా ప్రజెంట్ చేయాలని భావిస్తారో.. ఎగ్జాక్ట్ గా అలాగే తీయడానికి ప్రయత్నిస్తాడు. ఈ విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోడు, ఎవరేమనుకున్నా లెక్క చేయడు. ఈ లక్షణమే మిగిలిన దర్శకుల నుంచి సందీప్ రెడ్డి వంగాను వేరు చేస్తోంది.
అందుకే సందీప్ సినిమాలకు విమర్శలతోపాటు ఆదరణ కూడా దక్కుతోంది. దీంతో ఆయన తదుపరి తీయబోయే సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సందీప్ వంటి డైరెక్టర్ తో మూవీ తీయాలంటే అందరి వల్లా కాదు. సదరు నిర్మాతకు కూడా సినిమాల పట్ల అంతే ప్యాషన్ ఉండాలి. అప్పుడే ఆ కాంబో వర్కవుట్ అవుతుంది. అలా సందీప్తో తొలినుంచీ ట్రావెల్ అవుతున్న ప్రొడ్యూసర్ ఒకరు ఉన్నారు. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ హిందీ చిత్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్. తాజాగా వచ్చిన ‘యానిమల్’, అంతకుముందు సందీప్ తీసిన ‘కబీర్ సింగ్’ చిత్రాలను నిర్మించింది ఈయనే కావడం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ ద్వయం.. మరో మూడు బిగ్ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టింది. వాటిలో ప్రభాస్ హీరోగా రూపొందనున్న ‘స్పిరిట్’ సినిమా, అల్లు అర్జున్ కథానాయకుడిగా మరో మూవీ ఉన్నాయి. వీటితోపాటుగా యానిమల్ సీక్వెల్.. ‘యానిమల్ పార్క్’ ఉన్నాయి. కాగా సందీప్ తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగాతో కలిసి సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పైన ఈ చిత్రాలను భూషణ్ కుమార్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాడు. అలాగే ఇవి మూడూ ఒకదానికి మించి ఒకటి అన్నట్లు ఉండనున్నాయి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టులపై ఆయా హీరోల అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: