టాలీవుడ్లోని ట్యాలెంటెడ్ యంగ్ హీరోలలో ఆశిష్ వెలమకుచ ఒకరు. ఆయన హీరోగా త్వరలోనే కొత్త చిత్రం ప్రారంభం కానుంది. దిల్ రాజు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆశిష్.. తన తొలి సినిమా ‘రౌడీ బాయ్స్’తో యూత్ను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అనంతరం ఆశిష్ రెండో సినిమాగా ‘సెల్ఫిష్’ అనే చిత్రం చేశాడు. ఇందులో బ్లాక్బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’తో యువతరాన్ని ఆకర్షించిన ఇవానా కథానాయికగా చేసింది. కాశీ విశాల్ స్వార్థం చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ నేపథ్యంలో ఆశిష్ చేస్తున్న మూడో సినిమా కావడంతో ఈ కొత్త చిత్రంపై ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీపావళి సందర్భంగా తాజాగా ఈ చిత్రం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సందడి చేయడానికి వస్తోందని తెలిపారు. ఇటీవలే నిర్మాత హర్షిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ మూవీ టీమ్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. అయితే ఈ వేడుకకి ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య రావడం విశేషం. దీంతో ఈ సినిమాలో ఆశిష్ సరసన వైష్ణవి చైతన్య నటించనుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై చిత్ర బృందం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టమైన అనౌన్స్మెంట్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. సో.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. ‘బేబి’ తర్వాత వైష్ణవి చైతన్యకి యూత్లో క్రేజ్ బాగా పెరిగింది.
Coming with a bang soon!💥🔥 #Ashish3 @iamvaishnavi04 @pavan8232 @artkolla @HR_3555 #HanshithaReddy @naga_mallidi @DirVassishta @DilRajuProdctns pic.twitter.com/coaXCHmQXm
— Ashish Velamakucha (@AshishVoffl) November 12, 2023
కాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది ‘బలగం’ వంటి అద్భుతమైన సినిమాను అందించిన హన్షిత రెడ్డి మరియు హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం మూవీ టీమ్ సమక్షంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీగా ఇది తెరకెక్కుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అవినాష్ ఇంతకుముందు దసరా, మేజర్, శ్రీమంతుడు, హిట్ మరియు కృష్ణగాడి వీరప్రేమ గాథ వంటి పలు హిట్ సినిమాలకు పనిచేసిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: