టాలీవుడ్లోని ట్యాలెంటెడ్ డైరెక్టర్స్లో అజయ్ భూపతి ఒకరు. తొలి ప్రయత్నంలోనే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అందునా ముఖ్యంగా నూతన నటీనటులను ప్రధానపాత్రధారులుగా పరిచయం చేస్తూ తీయడం ఆయన గట్స్కి నిదర్శనం. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా, అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్స్గా ‘మహాసముద్రం’ అనే సినిమాను రూపొందించగా.. అది బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే అజయ్ భూపతి తీసింది రెండు సినిమాలే అయినా, ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంటుంది. దీనికి ఆయన సినిమాను డైరెక్ట్ చేసే విధానమే కారణం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా అజయ్ భూపతి ప్రస్తుతం మూడో సినిమాగా ‘మంగళవారం’ అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తాను పరిచయం చేసిన పాయల్ రాజ్పుత్ ఇందులో హీరోయిన్గా చేస్తుండగా.. నందితా శ్వేతా, దివ్యా పిళ్ళై, అజేయ గోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇది కూడా తనదైన స్తైల్లో రస్టిక్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ను ప్రకటించారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 21న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో.. ఒక పెద్ద చెట్టుకి ఇద్దరు వ్యక్తులు ఉరికి వేలాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
Sit tight & hold your breathe 🦋🥁💥#MangalavaaramTrailer to be out on October 21st 🔥
An @AJANEESHB Musical 🎶#Mangalavaaram @starlingpayal @Nanditasweta @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM @saregamasouth @PulagamOfficial pic.twitter.com/XRWvyYi079
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 17, 2023
ఇక ఇదిలా ఉండగా అజయ్ భూపతి ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ తెలిపారు. ఇండియన్ సినిమాల్లో ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని జోనర్లో దీనిని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. అలాగే సినిమాలో దాదాపు 30 పాత్రలు ఉంటాయని, కథనంలో అందరికీ ప్రత్యేకత ఉంటుందని కూడా స్పష్టం చేశారు. కాగా ‘మంగళవారం’ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ అనే బ్యానర్పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మలతో కలిసి అజయ్ భూపతి తన సొంత బ్యానర్ ‘ఏ క్రియేటివ్ వర్క్స్’ పతాకంపై స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకి కన్నడ ఆల్ టైం సూపర్ హిట్ ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కాగా ‘మంగళవారం’ సినిమాను తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: