టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నూతన చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో రూపొందుతోంది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్లో ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ రివీల్కు ముహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ 18న సాయంత్రం గం 6:30 ని.లకు అనౌన్స్ చేయబోతున్నట్లు ఈ మేరకు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దీనిని ఖరారు చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. అందులో విజయ్ దేవరకొండ స్కూల్ డ్రెస్లో ఉన్న చిన్న పిల్లల చేయి పట్టుకుని నడుస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ‘సీతారామం’ ఫేమ్ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. కాగా ‘లైగర్’ వంటి డిజాస్టర్ తర్వాత విజయ్ ‘ఖుషి’ సినిమాతో ఇటీవలే హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు మృణాళ్ కూడా నేచురల్ స్టార్ నానితో ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: