ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘యాత్ర’. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్లో, హావభావాల్లో వైఎస్సార్ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్లో నటి అనసూయ కీలక పాత్రలో కనిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రానికి సీక్వెల్గా ‘యాత్ర 2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ‘యాత్ర 2’ నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. తొలుత ప్రకటించినట్లుగానే ఈ మూవీ ఫస్ట్ లుక్ను నేటి ఉదయం 11 గంటలకు మేకర్స్ విడుదల చేశారు. ఇందులో.. ఒకవైపు జీవా ఉండగా, మరోవైపు మమ్ముట్టి ఉన్నారు. ”నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్రెడ్డి కొడుకుని” అని వైఎస్ జగన్ ప్రజలకు చెబుతున్నట్లుగా పోస్టర్లో పేర్కొన్నారు.
Presenting the first look of #Yatra2. In cinemas worldwide from 8th Feb, 2024.#Yatra2FL #Yatra2OnFeb8th #LegacyLivesOn @JiivaOfficial @ShivaMeka @MahiVraghav pic.twitter.com/4m4PhJsurF
— Mammootty (@mammukka) October 9, 2023
అలాగే ఈ సందర్భంగా ఫస్ట్ లుక్తో పాటు విడుదల తేదీ కూడా ప్రకటించారు. ఇక వైఎస్ జగన్గా జీవా మంచి ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను అందరూ ఊహించినట్లుగానే 2024 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇక ‘యాత్ర 2’లో ప్రధానంగా వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘట్టాలను చూపించనున్నారు.
ముఖ్యంగా.. వైఎస్ జగన్ రాజకీయ రంగప్రవేశం, అందుకు దారి తీసిన పరిస్థితులు, సొంతంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించడం, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టడం.. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం వంటివాటిని విపులంగా వివరించనున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మమ్ముట్టి తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. కాగా పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: