టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ కాగా, ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మంగళవారం (సెప్టెంబర్ 5, 2023) ముంబైలో ‘800’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాగా ఇటు సచిన్ ఇండియా తరఫున, అటు మురళీధరన్ శ్రీలంక తరఫున ఎన్నో మ్యాచ్ల్లో తలపడిన విషయం తెలిసిందే. అయితే మైదానంలో పోటీ పడినప్పటికీ… మైదానం వెలుపల ఇరువురికీ మంచి స్నేహం ఉంది. దీంతో మురళీధరన్ కోసం ‘800’ ట్రైలర్ను విడుదల చేసేందుకు సచిన్ వచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి సచిన్ తో పాటు శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ సనత్ జయసూర్య కూడా రావడం విశేషం. ఈ క్రమంలో ట్రైలర్ ఆవిష్కరణ ఆసాంతం సందడి నెలకొంది.
హైలైట్గా నిలిచిన సచిన్ స్పీచ్
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ‘1993లో నేను తొలిసారి మురళీధరన్ను కలిశాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతోంది. మురళీధరన్ ఎంతో సాధించాడు, అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. కెరీర్లో ఎన్నో అవరోధాలను అధిగమించి ఆయన విజేతగా నిలిచాడు. పిచ్ ఎలా ఉన్నా బంతిని టర్న్ చేసే ప్రతిభ మురళీధరన్ సొంతం. మురళీని ఎలా ఎదుర్కోవాలో మ్యాచ్కు ముందు మేము టీమ్ మీటింగ్స్లో ప్రత్యేకంగా డిస్కస్ చేసేవాళ్ళం. మై డియర్ ఫ్రెండ్ మురళీధరన్కి ఆల్ ది బెస్ట్’ అని పేర్కొన్నారు. ఇక ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని, నా బయోపిక్ మూవీ ట్రైలర్ ఆవిష్కరణకు ఆయన అతిథిగా రావడం గౌరవంగా భావిస్తున్నానని ముత్తయ్య మురళీధరన్ తెలిపారు.
కాగా ‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయనున్నారు. అక్టోబర్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: