టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ ‘ఖుషి’ మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఈ ఉదయం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రులు, సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండలతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. అలాగే ‘ఖుషి’ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మరియు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు, పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక స్వామివారి దర్శనానంతరం హీరో విజయ్ దేవరకొండ ఆలయం వెలుపల మాట్లాడుతూ – ఈ ఏడాది మా ఫ్యామిలీకి చాలా కలిసొచ్చింది. మా తమ్ముడు నటించిన ‘బేబి సినిమా’ మరియు నేను నటించిన ‘ఖుషి’ చిత్రాలు హిట్ అయ్యాయి. అందుకే కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మా కుటుంబ సభ్యులతో కలసి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నాం. అయితే కొన్నేళ్ల కిందట నేను యాదాద్రికి వచ్చినప్పుడు గుడి ఇంత బాగా లేదు. పునర్నిర్మాణంలో యాదాద్రిని అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం’ అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. మా అందరికీ ఏ ఇబ్బందీ లేకుండా స్వామివారి దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు, పోలీసులు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్లకు థాంక్స్ చెబుతున్నా. మా మైత్రీ సంస్థకు కూడా ఈ ఏడాది కలిసొచ్చింది. వాళ్ల రెండు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఖుషి హిట్ అయ్యింది. మాలాగే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని దేవుడిని కోరుకున్నా’ అని చెప్పారు. ఇక యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి ఖుషి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు వై రవి శంకర్, నవీన్ యెర్నేని తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: