పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ నుండి వస్తున్న ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో అభిమానులు అయితే ఈసినిమా కోసం మరింత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలమైంది. ఇప్పటికే శృతీహాసన్ తన షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక సలార్ నుండి అప్ డేట్స్ వచ్చి కూడా చాలా కాలం అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే షూటింగ్ ను సైలెంట్ గా పూర్తి చేేసుకుంటూ వెళుతున్నాడు ప్రశాంత్ నీల్. ఈనేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమా క్లైమాక్స్ ను ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈక్లైమాక్స్ లో దాదాపు 400 మంది పాల్గొంటున్నారట. కె.జి.యఫ్ ను మించి ఈసినిమా క్లైమాక్స్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: