శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరో రెండ్రోజుల్లో దసరా మూవీ విడుదల కాబోతుండటంతో హీరో నాని ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. హీరో నాని ఢిల్లీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. తాను మళ్లీ డెబ్యూ ఫిల్మ్ చేస్తున్న ఫీలింగ్ వస్తోందనీ , ఆడియెన్స్ ఎప్పుడూ కొత్త విషయాలను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారనీ , దసరా మూవీ కి రెండు రోజులే ఉండటంతో టెన్షన్ మొదలైందనీ , .తన మొదటి చిత్రం రిలీజ్ అప్పుడు కూడా ఇంత నెర్వస్ గా ఫీలవ్వలేదనీ , దసరామూవీ విషయంలో కాస్తా నెర్వస్ గా ఉందనీ ,అలాగే కొత్త సినిమాలు, మంచి సినిమాలు చేయడానికి సినిమా పట్ల ప్రేమ ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. ఒక్కోసారి కొత్త సినిమాల ప్రయోగాలు వర్కౌట్ అవుతాయనీ , కొన్నిసందర్భాల్లో ఫలితం వేరేలా ఉంటుందనీ , ఏదేమైనా ఆడియెన్స్ నిర్ణయిస్తారనీ , తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలే చేస్తున్నాననీ , మంచి సినిమా తీస్తే బాక్సాఫీస్ వసూళ్లు ఆటోమేటిక్గా వస్తాయనీ , ముందుగా ఆడియెన్స్ హృదయాలను గెలుచుకునే ప్రయత్నం చేయాలనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: