ఆర్ఆర్ఆర్ సినిమాతో భారత సినీ ఘనత మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగుతుంది. ఇప్పటికే ఈసినిమా పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసినిమా లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుల బరిలో ఉంది. 12వ తేదీన లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే హీరోలు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇంకా పలువురు యూఎస్ కి వచ్చి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ అవార్డుల నేపథ్యంలో హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా అక్కడకి వచ్చిన సినీ ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు భారత సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింతా ఎన్టీఆర్ తో సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది. ఇక ఈ సందర్భంగా ఆమె ఆస్కార్ నామినీలందరికీ అభినందనలు. మీ అందరికి అవార్డులు రావాలని కోరుకుంటున్నా. దక్షిణాసియాలోని కళాకారులను ఒక్కచోటుకి తెచ్చినందుకు ప్రియాంక చోప్రాకు ధన్యవాదాలు అని ప్రీతి జింతా తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: