పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో విశాల్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందిన విశాల్ ప్రేక్షకులను అలరించడానికై యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా పాల్గొని గాయాల పాలవుతున్నారు. హీరో విశాల్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్
(డిటెక్టివ్ )2 మూవీ లో నటిస్తూ నిర్మిస్తున్నారు. ఇప్పుడు విశాల్ మరో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మినీ స్టూడియో బ్యానర్పై అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్, రీతూవర్మ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ మార్క్ ఆంటోనీ తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ సునీల్, ఎజేసూర్య, సెల్వ రాఘవన్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేస్తూ.. స్టన్నింగ్ విజువల్స్ తో డిజైన్ చేసిన మోషన్ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మోషన్ పోస్టర్ విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే 5 లక్షలకుపైగా వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కమెడియన్ సునీల్ తన కెరీర్లో ఇప్పటివరకు కనిపించనటువంటి డిఫరెంట్ లుక్లో ఎంటర్టైన్ చేయబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























