శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీ ధర్, విజయలక్ష్మి, మొగిలి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు. ఈ మూవీ లో నటించిన నటీ నటులు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.3.75 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇవి గ్రాస్ కలెక్షన్లు కాగా.. షేర్ రూ.1.58 కోట్లుగా ఉంది. బ్రేక్ ఈవెన్ రూ.1.3 కోట్లు కాగా నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. .ఇప్పటికే 0.26 కోట్ల లాభాలు ఆర్జించింది. లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ బలగం మూవీని ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణాల్లో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. తమ బలగం మూవీ కలెక్షన్లు చూసి ప్రజెంటర్ దిల్ రాజు హర్షం వ్యక్తం చేశారు . రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతుండటంపై ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఏపీలోనూ ఈ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ పెరగనున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: