టాలీవుడ్ గత కొంతకాలం నుండి ఎంతో మంది మృతిచెందుతూ విషాదాన్ని మిగుల్చుతున్నారు. గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు లాంటి లెజెండరీ నటుల మృతిచెందగా.. ఈ ఏడాది మొదట్లోనే అలనాటి అందాల నటి జమున మరణించారు. ఇక ఆతరువాత లెజెండరీ దర్శకుడ కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతిచెందారు. కొద్ది రోజుల క్రితమే నందమూరి తారకరత్న పిన్న వయసులోనే మృతి చెందారు. ఇక ఇప్పుడు మరో విషాద ఘటన చేటుచేసుకుంది. కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మీ మరణించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలను పంజాగుట్టలోని స్మశానవాటికలో నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. మరి విశ్వనాథ్ చనిపోయి నెలరోజులు కూడా కాకముందే ఈమె చనిపోవడం బాధాకరమైన విషయం.
కాగా కె. విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఫిబ్రవరి 19, 1930లో జన్మించిన ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. ఇక సినీపరిశ్రమలో దాదాపు 6 దశాబ్దాలుగా దర్శకుడిగా, నటుడిగా సేవలందించారు విశ్వనాథ్. తన సినీ ప్రయాణంలో 53 సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు విశ్వనాధ్ 5 నేషనల్, 7 నంది, 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అంతేకాదు పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలు అందుకున్నారు. కాగా విశ్వనాథ్- జయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. అమ్మాయి పద్మావతి దేవి, అబ్బాయిలు కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: