మత్తు వదలరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా. మొదటి సినిమాతోనే మంచి హిట్ తోపాటు మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే దొంగలున్నారు జాగ్రత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీసింహా. ఇక ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో ఒక సినిమా ఉస్తాద్ కూడా. ఫణిదీప్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు. రేపు శ్రీసింహా పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అకీవా బి సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ సహా ఇతర వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: