రెండేళ్లకొకసారి ఫిల్మ్ఛాంబర్లో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసారి మాత్రం నాలుగేళ్లకు జరిగాయి. నిన్న చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు ఫిల్మ్ఛాంబర్లో జరిగాయి. ఈనేపథ్యంలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కె.ఎల్. దామోదర్ ప్రసాద్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దామోదర ప్రసాద్ కు 339 ఓట్లు, జెమిని కిరణ్ కు 315 ఓట్లు వచ్చాయి. 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలిచారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ, అశోక్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ట్రెజరర్ గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ మండలిలో సభ్యుల శ్రేయస్సే మా లక్ష్యంగా పని చేస్తాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. గిల్డ్, కౌన్సిల్ వేరు కాదు.. రెండు ఒక్కటే అని చెప్పారు.
జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టికుమార్ విజయం సాధించారు. ఈసీ మెంబర్గా నిర్మాత దిల్ రాజు గెలుపొందారు. దిల్ రాజు (470 ఓట్లు), దానయ్య (421 ఓట్లు), రవి కిషోర్ ( 419), యలమంచలి రవి (416) ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్స్గా పద్మిని, బెక్కం వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, గోపినాథ్ ఆచంట, మధుసూదన్ రెడ్డి, కేశవరావు, శ్రీనివాస్ వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్, కిషోర్ పూసలు తదితరులు ఎన్నికయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”-YrKU47Zexk,f5ngqM2oXQQ,b3_aeH8XX7A,d7pKlI6b2zc” playlist_auto_play=”0″
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: