గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా వీరసింహారెడ్డి. ఇక ఈసినిమా సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. బాలకృష్ణ నటన, యాక్షన్ సీక్వెన్స్, పాటలు ఇలా అన్నీ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. ఇక సినిమా సక్సెస్ తరువాత కూడా గోపీచంద్ మలినేని పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తన తరువాత సినిమాల గురించి కూడా ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ పవన్ తో సినిమా చేయడంపై రియాక్ట్ అయ్యారు. పవన్తో సినిమా చేయాల్సి ఉందని చెప్పారు. తనకు ఇష్టమైన వారు ఇద్దరు ఉన్నారని, అందులో ఒకరు బాలయ్య, రెండు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని, దానికి ఇంకా టైమ్ పడుతుందన్నారు. పవన్ మార్క్ కామెడీ, ఫన్ ఉంటూనే మాస్ యాక్షన్ మూవీగా తీస్తానని తెలిపారు. అలాగని, రాయలసీమ నేపథ్యంలో ఉండదని, తన స్టయిల్లోనే ఉంటుందని చెప్పారు. పవన్ స్టయిల్ వేరని ఆ జోనర్లోనే మాస్, క్లాస్ మిక్స్ చేసి తీస్తానని తెలిపారు. మరి చూద్దాం వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు సైట్స్ పైకి వెళుతుందో.
View this post on Instagram
కాగా వీరసింహారెడ్డి సినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇంకా దునియా విజయ్, మంజువారియర్, హనీ రోజ్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర, అన్నపూర్ణమ్మ, బ్రహ్మానందం, అలీ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమా మైత్రీ మూవీ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించారు. ఈసినిమాకు థమన్ సంగీతం, రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: