పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో వీఎఫ్ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రమే ఎక్కువ టైము పడుతుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి టీజర్ ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ టీజర్ కు కాస్త నెగెటివ్ కామెంట్స్ వచ్చిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ పెదవి విరిచారు. అందుకే ఇంకా గ్రాఫిక్స్ విషయంలో శ్రద్ద పెట్టారు. దీనికారణం చేతనే రిలీజ్ కూడా లేట్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని ఈసినిమా గ్రాఫిక్స్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ పళని ఈసినిమా గురించి చెబుతూ.. సినిమా టీజర్ కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన మాట నిజమే.. అయితే ఈసారి విజువల్స్ ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దామని తప్పకుండా ఈసారి అవుట్ పుట్ అయితే మెప్పిస్తుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. మరి చూద్దాం ఈసారి ఆదిపురుష్ అంచనాలు అందుకునే రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.
కాగా మైథలాజికల్ సినిమాగా ఈసినిమాను తెరకెక్కించాడు ఓం రౌత్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు. ప్రభాస్కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: