మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి , విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీ లో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ మూవీ కి హైలైట్ గా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ వన్ మ్యాన్ షో వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ ను వీరమాస్ బ్లాక్ బస్టర్ మీట్ పేరుతో మేకర్స్ నిన్న నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మీడియాతో మాట్లాడుతూ… నిజానికి ప్రీమియర్స్ నుండి చాలా ప్రాంతాల్లో తమ వీరసింహారెడ్డి మూవీకి మంచి రిపోర్ట్స్ వచ్చాయనీ.. అలానే ఇక్కడ తొలి షో నుండి కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడం ఎంతో ఆనందంగా ఉందనీ.. తమకు అందిన సమాచారం ప్రకారం వీరసింహారెడ్డి మూవీ ఫస్ట్ డే రూ.50 కోట్ల మేర అందుకున్నట్లు ఆయన చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: