అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చిన సంగతి తెలిసిందే కదా. ఒకప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. ఇక ఇప్పుడు తన సినిమాల్లో విభిన్నత మాత్రమే ఉండాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఆ అంచనాలను పెంచేశారు. ఇక ముందుగా ఈసినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ నవంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్ గానే మార్చారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో నరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడు. ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: