ఈ ఏడాది బంగార్రాజు, బ్రహ్మస్త్ర సినిమాలతో మంచి హిట్లను అందుకున్న నాగార్జున ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించడానికి వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు హీరోగా నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీగానే అంచనాలుఉన్నాయి. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అంతా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. దానికి నాగార్జున బదులిస్తూ తాను మరియు కృష్ణ గారు వారసుడు చిత్రానికి కలిసి పనిచేశారని మరియు వారు సర్కిల్ను ఎందుకు పూర్తి చేయకూడదని మహేష్ను అడిగారు. అప్పట్లో ఆ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు తాజాాగా మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్ననే కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి నాగ్ తనయులు కూడా నాగ చైతన్య, అఖిల్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లోనే నాగ్ ను ఇదే ప్రశ్నను అడుగగా.. నాగార్జున స్పందిస్తూ, మహేష్తో కలిసి పనిచేయడానికి తాను చాలా సిద్ధంగా ఉన్నానని.. మహేష్ నుండి సిగ్నల్ రావడమే తరువాయి అంటూ సమాధానం ఇచ్చారు. చూద్దాం మరి మహేష్ ఫ్యూచర్ లో ఏమైనా దీని గురించి ఆలోచిస్తాడేమో..
కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్పోల్ ఆఫీసర్స్గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: