సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే కదా. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా తన సత్తాను చూపించింది. పాన్ ఇండియా రేంజ్ లో తీసిన ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు సుకుమార్ కథ, బన్నీ మేకోవర్, బన్నీ యాస అన్నీ ప్రధాన బలంగా నిలిచాయి. ఇక ఈసినిమా పాటలు మరో సంచనం. ఈసినిమాలోని పాటలు, స్టెప్ లు అన్నీ రికార్డులు క్రియేట్ చేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ వేసిన శ్రీవల్లి పాట హుక్ స్టెప్ అయితే అందరూ రీల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికీ ఈసినిమా ఏదో ఒకరకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం అయితే అందరూ ఎదురుచూసేది పుష్ప 2 సినిమా కోసం. ఈసినిమా పై భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గానే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే రెగ్యులర్ షూట్ కు మాత్రం కొంచం టైమ్ పడుతుంది. ఇక ఇప్పటికే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమాపై ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి దేవిశ్రీ మాట్లాడుతూ.. ఇంతవరకూ మూడు పాటలను ట్యూన్ చేశాను. ప్రతి పాట కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సుకుమార్ కి ఈ ట్యూన్స్ విపరీతంగా నచ్చాయి. అంతేకాదు సుకుమార్ కూడా కథను రెడీ చేసి పెట్టుకున్నాడు. ఈ కథ ఎలా ఉంటుందనేది ఎవరూ గెస్ చేయలేరు అంటూ చెప్పుకొచ్చాడు. మరి చూద్దాం పుష్ప2 సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో..
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్లో సందడి చేసింది. ఈ చిత్రం మొత్తం రూ.365 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక త్వరలోనే ‘పుష్ప-దిరూల్’ షూటింగ్ ను కూడా ప్రారంభం చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: